Top Stories
ప్రధాన వార్తలు
ఆగస్ట్ 14 నుంచి .. నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్
ఢిల్లీ: నీట్ యూజీ కౌన్సిలింగ్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆగస్ట్ 14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆగస్ట్ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కౌన్సిలింగ్పై అప్డేట్స్ను ఎంసీసీ వెబ్సైట్లో చూడాలని సూచించింది. ఈ మేరకు నీట్ అభ్యర్థులకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఒక నోటీసు విడుదల చేసింది.
సమగ్ర భూ సర్వే పై చంద్రబాబు యూటర్న్
సాక్షి, అమరావతి : సమగ్ర భూ సర్వేపై సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన చంద్రబాబు.. మళ్లీ దాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో సమగ్ర భూ సర్వేకి శ్రీకారం చుట్టగా. ఇప్పుడు అదే సర్వేని కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు సమగ్ర భూ సర్వేపై రెవెన్యూ శాఖ మంత్రి అనగానికి సత్యప్రసాద్ స్పందించారు. సమగ్ర సర్వేను మిగిలిన గ్రామాల్లోనూ చేపడతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. గతంలో చేసిన సర్వేపై గ్రామ సభలు పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.. ‘రీ సర్వే 7 వేల గ్రామాల్లో పూర్తి అయ్యింది. 5 శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తాం. ఆ తర్వాత మళ్ళీ రీ సర్వేని ముందుకు తీసుకుని వెళతాం’ అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.గతంలో సమగ్ర సర్వేపై చంద్రబాబు ఏమన్నారంటేరాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు గతంలో నారా చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన హయాంలో ఒకసారి రీ సర్వే చేయాలని భావించామని, కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండటంతో ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వేను చేపట్టిందని విమర్శించారు. ఇకపై భూ యజమానులు వచ్చి తమ హద్దులు నిర్ణయించాలని కోరితే మినహా ఎవరికీ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు అదే సమగ్ర భూ సర్వేపై చంద్రబాబు యూటర్న్ తీసుకోవడం గమనార్హం.
పారిస్ ఒలింపిక్స్.. క్వార్టర్స్కు చేరిన సాత్విక్- చిరాగ్ జోడీ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి అదరగొట్టారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్ జంట అడుగుపెట్టింది. తద్వారా ఓ అరుదైన ఘనతను ఈ స్టార్ భారత జోడీ తమ పేరిట లిఖించుకున్నారు. ఒలింపిక్స్ చరిత్రలోనే బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో క్వార్టర్స్కు చేరిన తొలి భారత జోడీగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు. ఇండోనేషియాకు చెందిన అల్ఫియన్- ఫజార్ చేతిలో 21-13, 21-10 తేడాతో ఫ్రెంచ్ ద్వయం లాబార్-కోర్వీ ఓడిపోవడంతో సాత్విక్-చిరాగ్ క్వార్టర్స్ బెర్త్ ఖారారైంది.కాగా సోమవారం నాటి రెండో మ్యాచ్లో సాత్విక్- చిరాగ్ జంట జర్మనీ జోడీ మార్విన్ సీడెల్- మార్క్ లామ్స్ఫస్తో తలపడాల్సింది. అయితే, మార్క్ మోకాలి గాయం కారణంగా ఈ జర్మనీ ద్వయం పోటీ నుంచి తప్పుకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ను నిర్వహకులు రద్దు చేశారు. ఈ క్రమంలో క్వార్టర్ ఫైనల్కు భారత జోడీ చేరాలంటే మంగళవారం ఇండోనేషియా జంటపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతలోనే సోమవారం జరిగిన సెకెండ్ మ్యాచ్లో ఫ్రెంచ్ జోడీని ఇండోనేషియా ద్వయం ఓడించడంతో భారత్ క్వార్టర్ట్కు మార్గం సుగమమైంది. ఫ్రాన్స్ ఇంటి ముఖం పట్టడంతో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ సి పాయింట్ల పట్టికలో సాత్విక్- చిరాగ్ పెయిర్ రెండో స్ధానంలో నిలిచింది. ఈ జోడీ తమ చివరి గ్రూపు మ్యాచ్లో మంగళవారం ఇండోనేషియా జంట ఫజర్ అల్ఫియాన్- మహమ్మద్ రియాన్ ఆర్టియాంటోతో తలపడనుంది.భారత్- అర్జెంటీనా హాకీ మ్యాచ్ డ్రాభారత్- అర్జెంటీనా పురుషుల హాకీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1 సమంగా గోల్స్ చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ చివరి నిమిషంలో గోల్ కొట్టి భారత్ను ఓటమి నుంచి తప్పించాడు. భారత తమ తదుపరి మ్యాచ్లో జూలై 30న ఐర్లాండ్తో ఆడనుంది.
సీతక్కపై పాడి కౌశిక్రెడ్డి వ్యాఖ్యలు.. అసెంబ్లీలో దుమారం
సాక్షి,హైదరాబాద్: మహిళలకు ఉచిత బస్సు స్కీమ్పై తెలంగాణ అసెంబ్లీలో సోమవారం(జులై 29) దుమారం రేగింది. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ క్రమంలో మంత్రి సీతక్కకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు, ఆర్టీసీ కార్మికులకు ఏం చేసిందో నాలెడ్జ్ లేకపోవచ్చని కౌశిక్రెడ్డి అన్నారు. నాలెడ్జ్ లేదు అన్న మాటలపై కాంగ్రెస్ సీరియస్ అయింది. నాలెడ్జ్ లేదు అన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలి లేదా ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్పీకర్ కలుగజేసుకోవడంతో సీతక్కపై మాట్లాడిన మాటలను కౌశిక్రెడ్డి వెనక్కి తీసుకున్నారు.
‘సూపర్సిక్స్’ అమలు ఎప్పుడు?: లోక్సభలో ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సారీ సిక్స్ గా మార్చవద్దని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి కోరారు. సోమవారం(జులై 29) లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ అమలుకు గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు లేకుండా పెట్టుబడులు ఎలా..ఏపీలో శాంతిభద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయి. నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. నాపైన దాడి చేశారు. నా వాహనాన్ని ధ్వంసం చేశారు. అన్ని టీవీ చానల్స్ చూస్తుండగానే దాడి జరిగింది. నాపైనే దాడి చేసి నాకు వ్యతిరేకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలి. హింసకు చరమ గీతం పాడాలి. అమరావతికి రుణం వద్దు.. గ్రాంట్గా కావాలి..పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి బాధ్యులు ఎవరు. అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్లు రుణంగా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. పదేళ్లు గడిచిన విశాఖ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. బడ్జెట్లో రూ. 11 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించవద్దు’అని మిథున్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
‘దోస్త్ మేరా దోస్త్’తో సెల్ఫీ సంబరం
‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ ఈ ప్రపంచంలో ఎవ్వరైనా ఈ మాటల్ని వింటే పులకించి పోవాల్సిందే. అదీ స్నేహం గొప్పతనం. స్నేహానికి కులం, మతం, ప్రాంతం, భాష, లింగ భేదాలేవీ వుండవు. ఉన్నదంతా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడమే. దోస్త్ అంటే వీడేరా అనిపించేంత బంధం. మరి ‘దోస్త్ మేరా దోస్త్ తుహై మేరీ జాన్.. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం’’ అనుకునేంత గొప్ప దోస్తులు మీ జీవితంలో ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం అలాంటి నిజమైన స్నేహితుడితో సంతోష క్షణాలను మళ్లీ గుర్తు చేసుకోండి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ దోస్తుతో సెల్పీ దిగి సాక్షి. కామ్కు పంపించండి. ‘దోస్త్ మేరా దోస్త్’ సెల్పీ 9182729310 నెంబరుకు వాట్సాప్ చేయండి. ఆ ఫొటోలను సాక్షి డాట్ కామ్లో ప్రచురిస్తాం. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడమే కాదు.. ఈ జ్ఞాపకాన్ని కలకాలం పదిల పర్చుకోండి. ఫ్రెండ్షిప్ డే గురించి ఇవి మీకు తెలుసా?అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ ప్రతిపాదన 1958 జూలై 30న పరాగ్వేలో మొదలైంది. వరల్డ్ ఫ్రెండ్షిప్ డే ఆలోచనను తొలిసారి 1958, జూలై 20న పరాగ్వేలో స్నేహితులతో విందు సందర్భంగా డాక్టర్ ఆర్టెమియో బ్రాచో ప్రతిపాదించారు.ఐక్యరాజ్యసమితి 2011లో జూలై 30ని అధికారిక అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని వివిధ దేశాలలో వేర్వేరు రోజులలో జరుపుకుంటారు. భారతదేశంలో ఆగస్టు నెలలోని తొలి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేను(జులై 30ని) కూడా ఫాలో అవుతోంది ఇండియా.మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, బంగ్లాదేశ్తో సహా ఇతర దేశాలలో జూలై 30న జరుపుకుంటారు.
పారిశ్రామిక దిగ్గజం.. ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి
భారతీయ దిగ్గజ సంస్థ 'టాటా గ్రూప్' నేడు ఈ స్థాయిలో ఉందంటే దాని వెనుక ఎంతోమంది కృషి ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి 'జేఆర్డీ టాటా' (జహంగీర్ రతన్జీ దాదాభోయ్ టాటా). 1904 జులై 29న జన్మించిన ఈయన సుమారు 53 సంవత్సరాలు టాటా గ్రూప్ సంస్థకు ఛైర్మన్గా ఉన్నారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే కంపెనీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.జేఆర్డీ టాటా ఛైర్మన్గా ఉన్న కాలంలోనే టీసీఎస్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టైటాన్ వంటి విజయవంతమైన వెంచర్లతో సహా 14 కొత్త కంపెనీలను ప్రారంభించారు. అంతే కాకుండా 1956లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) తరహాలో టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (TAS)ని స్థాపించారు.జేఆర్డీ టాటా సంస్థలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం విరివిగా విరాళాలు అందించారు. రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని అనే భావన ప్రవేశపెట్టిన ఘనత జేఆర్డీ టాటా సొంతం. అంతే కాకుండా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య సేవలు, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ప్రారంభించారు. ప్రమాదాల సమయంలో కార్మికులకు నష్టపరిహారం అందించే విధానం కూడా ఈయనే మొదలుపెట్టారు.1936లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) స్థాపించారు. ఆ తరువాత 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR), నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కూడా స్థాపించారు. 1968లో టాటా కంప్యూటర్ సెంటర్గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్థాపించారు. నేడు ఈ కంపెనీ భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది. ఆ తరువాత 1987లో టైటాన్ను స్థాపించారు.15 సంవత్సరాల వయసులోనే ఫైలట్ కావాలని, విమానయాన రంగంలో వృత్తిని కొనసాగించాలని నిశ్చయించుకున్న జేఆర్డీ టాటా 24 ఏళ్ల వయసులో ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు. దీంతో ఈయన భారతదేశంలో మొట్టమొదటి ఫ్లయింగ్ లైసెన్స్ పొందిన వ్యక్తిగా నిలిచారు. ఆ తరువాత టాటా ఎయిర్ సర్వీస్ ప్రారంభించారు. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే చివరికి ఈ సంస్థ మళ్ళీ ఎయిర్ ఇండియాగా టాటా గ్రూపులోకే వచ్చింది.టాటా గ్రూప్ అభివృద్ధికి మాత్రమే కాకుండా.. ఉద్యోగుల జీవితాల్లో కూడా మార్పులు తీసుకువచ్చిన జేఆర్డీ టాటా 1993 నవంబర్ 29న జెనీవాలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. పారిశ్రామిక రంగంలో ఈయన చేసిన కృషికి భారత ప్రభుత్వం భారతరత్న ప్రధానం చేసింది. దీంతో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందిన ఏకైక పారిశ్రామికవేత్తగా జేఆర్డీ టాటా చరిత్ర సృష్టించారు.
చంద్రబాబు-పవన్ ముందున్నది ఒకటే ఆప్షన్!
‘‘మనం హామీలు ఇచ్చాం.. సూపర్ సిక్స్ చెప్పాం.. చూస్తే భయమేస్తోంది. ముందుకు కదలలేకపోతున్నాం..ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి’’.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో చేసిన ప్రకటన. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈయన అన్న మాటలు గమనించండి.'ఇంకా సంపద సృష్టిస్తా..ఆదాయాన్ని పెంచుతా..ఈ పెంచిన ఆదాయం పేదవాళ్లకోసం ఖర్చు పెడతా.."అని బహిరంగ పభలలో చెప్పారు. అంతేకాదు..తల్లికి వందనం కింద ఎందరు పిల్లలుంటే అందరికి పదిహేనువేల చొప్పున ఇస్తాం. ఒకరుంటే ఒకరికి ,ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తా..ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తా..నలుగురు ఉంటే నలుగురికి ఇస్తా.."అని ఆయన చెప్పేవారు. మరి ఇప్పుడో.. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించింది ఎక్కడకు పోయిందో కాని, ప్రజలంతా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల గురించి ఆలోచించాలని చెబుతున్నారు. దీనిపైనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ చంద్రబాబు ఎప్పుడైనా ఒక మోడెస్ ఆపరేండి అమలు చేస్తారని, తొలుత హామీలు ఇచ్చేస్తారని, ఆ తర్వాత తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వాటిని అమలు చేయడం కష్టమని ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వ స్కీములపైన అయినా, ఎవరినైనా వ్యక్తిగతంగా హననం చేయాలన్నా ఇదే పద్దతి అవలంభిస్తారని జగన్ వ్యాఖ్యానించారు. చివరికి పిల్లనిచ్చిన మామ ఎన్.టి.రామారావును కూడా చంద్రబాబు వదలిపెట్టలేదని, ఆయనపై సైతం దుష్ప్రచారం చేశారని జగన్ పేర్కొన్నారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే విధానాన్ని చంద్రబాబు అవలంభిస్తున్నారు. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్ల అప్పు చేసిందని తెగ ప్రచారం చేశారు. అయినా తనకు సూపర్ సిక్స్ అమలు చేయగల సత్తా ఉందని అనేవారు. జనం కూడా కొంతవరకు ఆయనను నమ్మారు. సీనియర్ కనుక, ఏదో సంపద అని అంటున్నారు కనుక ,దానిని సృష్టించి హామీలు అమలు చేస్తారులే అని జనం అనుకున్నారు. కానీ చంద్రబాబు తన పాత ఎగవేత స్కీమ్ నే యధా ప్రకారం అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆలోచన చేశారు. మొత్తం సమస్యలన్నిటికి జగన్ ప్రభుత్వమే కారణమని ప్రచారం ఆరంభించారు. ఏకంగా జగన్ ప్రభుత్వం వల్ల 12,96 లక్షల కోట్ల ఆర్దిక విధ్వంసం జరిగిందని కాకి లెక్కలు చెప్పారు. పోలవరం జాప్యం వల్ల రూ.45 వేల కోట్ల రూపాయల నష్టం. అమరావతివల్ల ఇంత నష్టం ..అంటూ ఏవేవో పిచ్చి లెక్కలు వేసి అసలు విషయాన్ని చల్లగా బయటపెట్టేశారు. తనకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని ఉందని, కాని ఆర్ధిక పరిస్థితి బాగోలేదని ,ప్రజలు అర్దం చేసుకోవాలని అంటున్నారు. ఇక అప్పుల మీద కూడా నోటికి వచ్చిన అంకెలను చెప్పి ప్రజలను నమ్మించాలని చూశారు. తొమ్మిది లక్షల డెబ్బైనాలుగువేల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలని ఆయన కోరారు. జగన్ 2.71 లక్షల కోట్ల డబ్బు బటన్ నొక్కి బదిలీ చేస్తే.. ఇంత అప్పు ఎందుకు అయిందని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నించారు. మరి ఎన్నికలకు ముందు రూ. 13 లక్షల కోట్ల అప్పు అని ఎలా ప్రచారం చేశారని చంద్రబాబును ఎవరైనా ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది.నిజానికి రాష్ట్రాన్ని ఆర్ధికంగా విధ్వంసం చేయడానికి పూనుకుంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే.అందుకే బాద్యతారహితంగా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు. పైగా తమ అంత సమర్ధులు లేరని, సంపద సృష్టించి చూపుతామని కోతలు కోశారు.కాని ఇప్పుడు ఏమంటున్నారు. ప్రజలు ఆలోచించాలట. ఎమ్మెల్యేలు తమ ఆలోచనలు ప్రభుత్వానికి ఇవ్వాలట. ఇందుకోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారట.గత ప్రభుత్వ హయాంలో క్షీణించిన శాంతిభద్రతలు , జరిగిన ఆర్ధిక అవకతవకలపై రాష్ట్రంలోని ప్రతి పల్లెలో చర్చ చేపడతారట. ఇంతకన్నా పచ్చి మోసం ఇంకొకటి ఉంటుందా?ఎన్నికల మానిఫెస్టోలో ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయల విలువైన హామీలు ప్రకటించినప్పుడు ఎవరిని అడిగి చేశారు?సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడు.. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని ఎలా చెప్పగలిగారు? అది దారుణమైన అసత్యమని తెలిసి కూడా అలాంటి వాగ్దానం చేయడం జనాన్ని మోసం చేయడం కిందకు వస్తుందా? రాదా?. చంద్రబాబు తన ఆత్మసాక్షిని అడిగి జవాబివ్వగలరా? చంద్రబాబు ఆత్మతో నిమిత్తం లేకుండా అబద్దాలను చెప్పగలరన్న వైఎస్సార్సీపీ నేతల విమర్శలకు సమాధానం ఇవ్వగలరా!. ఏడు శ్వేతపత్రాలపై రాష్ట్రం అంతా చర్చిస్తారట. ఇదే కొత్తగా చెబుతున్న పాత డ్రామా అన్నమాట. 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు టీడీపీ గెలిస్తేనే మద్య నిషేధం, రెండు రూపాయలకే కిలో బియ్యం స్కీమ్, విద్యుత్ చార్జీల తగ్గింపు మొదలైనవి యధావిధిగా కొనసాగుతాయని ప్రచారం చేశారు. తీరా టిడిపికి సగం సీట్లు వచ్చాక, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు నిర్వహించి వాటన్నిటికి మంగళం పాడారు. ఇప్పుడు కూడా సరిగ్గా సూపర్ సిక్స్ ఎగవేతకు రంగం సిద్దం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎప్పుడైనా హామీల అమలు సాద్యాసాద్యాల మీద రాష్ట్రం అంతా చర్చ పెడతామని చెప్పలేదే!. కాని ఇప్పుడు హామీలను అమలు చేయలేకపోతున్నామని, దీనిపై ప్రజలంతా చర్చించి సలహాలు ఇవ్వాలని అంటున్నారు ఇంతకన్నా చీటింగ్ వేరే ఏమైనా ఉంటుందా?అని జగన్ ప్రశ్నించడంలో అర్దం ఉంది.ఎన్నికలకు ముందు జగన్ చాలా స్పష్టంగా చంద్రబాబు జనాన్ని మోసం చేయడానికి సూపర్ సిక్స్ అంటున్నారని నెత్తి,నోరు మొత్తుకుని చెప్పారు. చంద్రబాబు మాటను నమ్మరని ఆయన అనుకున్నారు. కాని ప్రజలు మాత్రం చంద్రబాబు ట్రాప్ లో చిక్కుకున్నారు.అదే ట్రాప్ ను ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఈ మోసంలో భాగస్వామిగా ఉండడానికి ఏ మాత్రం సిగ్గుపడడం లేదు. జగన్ ఈ అంశాలను ప్రస్తావిస్తూ మొత్తం అప్పు 7.48లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. చంద్రబాబు 2019 లో దిగిపోయేనాటికి ఖజానాలో వంద కోట్లే మిగిల్చివెళితే, తాను 2024లో దిగిపోయేటప్పటికీ ఏడువేల కోట్ల నుంచి ఎనిమిదివేల కోట్ల రూపాయల నిధులు ఖజానాలో ఉన్నాయని, దీనిని బట్టి ఎవరు ఆర్దిక విధ్వంసానికి పాల్పడింది అర్ధం చేసుకోవచ్చని జగన్ వ్యాఖ్యానించారు. 2014 లో కూడా చంద్రబాబు రైతుల రుణాలన్నింటినీ రద్దు చేస్తానని నమ్మబలికారు. కాని చేయలేక చతికిలపడ్డారు. తిరిగి 2024లో కూడా అదే తరహా హామీలు ఇచ్చి మళ్లీ జనాన్ని మాయ చేయగలిగారు. చేసిన వాగ్దానాలకు బడ్జెట్ కేటాయించవలసి వస్తుందని, అది సాధ్యం కాదు కనుకే చంద్రబాబు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేకపోతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. సాధారణంగా ఎన్నికలు అయిన వెంటనే పూర్థిస్థాయి బడ్జెట్ పెడతారు. కాని చంద్రబాబు ఆ పని చేయలేకపోవడం బలహీనతగానే కనిపిస్తోంది. చంద్రబాబేమో తాను వాగ్దానాలను అమలు చేయడం కష్టం అన్న సంకేతలు ఇస్తూ, జగన్ పై మొత్తం కధను నెట్టేయడానికి బేషజం లేకుండా ప్రయత్నిస్తున్నారు. అదే జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నడూ డబ్బులు లేవని, కష్టాలు పడుతున్నానని, ప్రజలు సలహాలు ఇవ్వాలని కోరలేదు. తనతంటాలేవో తాను పడి ఆర్ధిక వనరులు సమకూర్చుకుని స్కీములు అమలు చేశారు. ఏపీని టీడీపీ నేతలు అరాచకానికి చిరునామాగా మార్చారని జగన్ విమర్శిస్తే.. లోకేష్ దానికి బదులు ఇస్తూ ఇంకా రెడ్ బుక్ తెరవలేదని అంటున్నారు. అంటే ఆ బుక్ ఓపెన్ చేయకముందే ఇంత ఆరాచకం చేస్తే, బుక్ తెరచి ఇంకెందరిపై ఘాతుకాలకు పాల్పడతారో అనే సందేహం సహజంగానే అందరిలో వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ముందున్నది ఒకటే ఆప్షన్.జనాన్ని ఎలా మోసం చేయాలన్నదే..జనాన్ని ఎలా అబద్దాలతో నమ్మించాలన్నదే. ప్రజలను ఎలా డైవర్ట్ చేయలన్నదే. అందుకే తన తప్పులన్నింటిని జగన్ పై తోసివేసి కథ నడపాలని రాష్ట్ర వ్యాప్త చర్చల డ్రామాకు తెరదీస్తున్నారు. జనం అంతా ఎగబడి తమకు ఈ స్కీములు వద్దని చెప్పాలన్నమాట. ఎవరైనా స్కీములు ఎందుకు అమలు చేయరని? అడిగితే వారిని రాష్ట్ర ద్రోహులుగా ముద్ర వేయాలన్నమాట!. ఈ రకమైన కొత్త వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ను అబద్దాల ప్రదేశ్ గా మార్చడమే టీడీపీ ఎజెండా. దానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్లు నాయకత్వం వహిస్తున్నారన్నమాట.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఇటీవల క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది. ఈ ఏడాది జూన్ 7న థియేటర్లలో రక్షణ్ మూవీ రిలీజైంది. విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆహా సంస్థ ట్వీట్ చేసింది. లేడీ సింగ్ గర్జించేందుకు వస్తోంది అంటూ మూవీ పోస్టర్ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్ ఏసీపీ పాత్రలో అలరించారు. కథేంటంటే.. కిరణ్(పాయల్ రాజ్పుత్) ఓ పవర్ఫుల్ ఏసీపీ. అనేక కేసులను ఈజీగా సాల్వ్ చేసిన కిరణ్.. తన స్నేహితురాలు హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతుంది. ఓ సైకో ఆమెను హత్య చేసి..అది ఆత్మహత్యగా చిత్రీకరించాడని కిరణ్ అనుమానిస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రేమించమని అమ్మాయిల వెంటపడుతూ హింసించే అరుణ్(మానస్)ని కిరణ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. దీంతో కిరణ్పై అరుణ్ పగపెంచుకుంటాడు. ఓ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో కిరణ్ ఫోటోలను పోస్ట్ చేసి..ఆమె మొబైల్ నంబర్ని పబ్లిక్లో పెడతాడు. దీంతో కిరణ్కు అసభ్యకరమైన సందేశాలు..పోన్లు వస్తుంటాయి.ఇది అరుణ్ చేసిన పనే అని కనిపెట్టిన కిరణ్.. అతన్ని పట్టుకునేందుకు ఓ బంగ్లాకు వెళ్లగా..అరుణ్ ఆమె కళ్లముందే బంగ్లాపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఏసీపీ కిరణ్ వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఓ వీడియో కూడా చిత్రీకరిస్తాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కిరణ్ సస్పెండ్కి గురవుతుంది. ఆ తర్వాత కిరణ్ లోతుగా విచారించగా.. తన స్నేహితురాలితో పాటు అరుణ్ ఆత్మహత్యల వెనుక ఎవరో ఒకరు ఉన్నారని, ఆయనే వీరిద్దరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు తన స్నేహితురాలితో పాటు మరికొంతమంది యువతులను చంపాడు? అరుణ్కి ఆ సైకో కిల్లర్కి ఉన్న సంబంధం ఏంటి? కిరణ్ని లూజర్ చేయాలని ఎందుకు ప్రయత్నించాడు? ఆ సైకో కిల్లర్ని కిరణ్ కనిపెట్టిందా? చివరికి ఏం జరిగింది? ఈ కథలో రోషన్ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. Lady Singam is ready to roar!👮🏻♀️Payal's 'Rakshana' is coming on aha!!🎬 #Rakshana premieres Aug 1st only on aha @starlingpayal @ActorMaanas @RajeevCo @actorchakrapani @sivannarayana_ @PrandeepThakore pic.twitter.com/sOdDmVSHKz— ahavideoin (@ahavideoIN) July 29, 2024
మాంసాహారం వడ్డన.. వందేభారత్ రైలులో వెయిటర్పై దాడి
కలకత్తా: వందేభారత్ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్లోని హవ్డా నుంచి రాంచీకి వందేభారత్ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్ చేశాడు. అయితే ఒక వెయిటర్ పొరబాటున మాంసాహారం వడ్డించారు. ఆ వృద్ధ ప్రయాణికుడు కొద్దిసేపటికి అది నాన్-వెజ్ భోజనం అని గుర్తించాడు. Kalesh b/w a Passenger and Waiter inside Vande Bharat over A person slapped a waiter for mistakenly serving him non-vegetarian foodpic.twitter.com/Oh2StEthyX— Ghar Ke Kalesh (@gharkekalesh) July 29, 2024 శాకాహారి అయిన తనకు మాంసాహారాన్ని వడ్డించాడన్న ఆగ్రహంతో వెయిటర్పై దాడికి దిగాడు. ఎంతమంది అడ్డుకున్నా ఆగకుండా వెయిటర్పై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై తూర్పు రైల్వే స్పందించింది. ‘అవును, పొరబాటు జరిగింది. అంగీకరిస్తున్నాం. సమస్యను పరిష్కరించాం’అని క్లారిటీ ఇచ్చింది.
విక్రమ్ 'తంగలాన్' ట్విటర్ రివ్యూ
Test Article
సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు
మన స్టార్టప్ వ్యవస్థే ప్రపంచానికి దిక్సూచి..
అలాంటి లుక్లో సంయుక్త మీనన్.. మెరిసిపోతున్న శివం భజే హీరోయిన్!
శ్రీలంకతో మూడో టీ20.. సంజూకు మరో ఛాన్స్! భారత తుది జట్టు ఇదే?
సమంత సలహాపై విమర్శలు.. ఈ పని అప్పుడే చేయాల్సింది!
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. విచారణకు కమిటీ
టీమిండియాలో నో ఛాన్స్.. అక్కడ మాత్రం ఇరగదీశాడు! ఎవరంటే?
మాంసాహారం వడ్డన.. వందేభారత్ రైలులో వెయిటర్పై దాడి
సంద్రం.. జనసంద్రం
క్షణం ఆలోచించలేదు.. వాళ్ల కోసమే కల్కి చేశా: మృణాల్ ఠాకూర్
వరల్డ్కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది?
Weekly Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన హసరంగ
ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్!
టీనేజ్ గుర్తొచ్చింది!
Lok Sabha Election 2024: ఎన్నికల ఉపాధి... 9 లక్షల మందికి!
చంద్రబాబు, పవన్కు పొలిటికల్ ట్విస్ట్.. బీజేపీ కీలక ప్రకటన!
Fact Check: రుచీపచీ లేని రాతలు
విక్రమ్ 'తంగలాన్' ట్విటర్ రివ్యూ
Test Article
సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు
మన స్టార్టప్ వ్యవస్థే ప్రపంచానికి దిక్సూచి..
అలాంటి లుక్లో సంయుక్త మీనన్.. మెరిసిపోతున్న శివం భజే హీరోయిన్!
శ్రీలంకతో మూడో టీ20.. సంజూకు మరో ఛాన్స్! భారత తుది జట్టు ఇదే?
సమంత సలహాపై విమర్శలు.. ఈ పని అప్పుడే చేయాల్సింది!
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. విచారణకు కమిటీ
టీమిండియాలో నో ఛాన్స్.. అక్కడ మాత్రం ఇరగదీశాడు! ఎవరంటే?
మాంసాహారం వడ్డన.. వందేభారత్ రైలులో వెయిటర్పై దాడి
సంద్రం.. జనసంద్రం
క్షణం ఆలోచించలేదు.. వాళ్ల కోసమే కల్కి చేశా: మృణాల్ ఠాకూర్
వరల్డ్కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది?
Weekly Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన హసరంగ
ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్!
టీనేజ్ గుర్తొచ్చింది!
Lok Sabha Election 2024: ఎన్నికల ఉపాధి... 9 లక్షల మందికి!
చంద్రబాబు, పవన్కు పొలిటికల్ ట్విస్ట్.. బీజేపీ కీలక ప్రకటన!
Fact Check: రుచీపచీ లేని రాతలు
సినిమా
ప్రభాస్ 'రాజాసాబ్' గ్లింప్స్ వచ్చేసింది
ప్రభాస్- మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఆపై సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. కామెడీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు రివీల్ చేశారు.తాజాగా విడుదలైన రాజాసాబ్ గ్లింప్స్లో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు అందరూ డార్లింగ్ ఈజ్ రిటర్న్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ, మలయాళం భాషలలో 2025 ఏప్రిల్ 10న రాజాసాబ్ విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
బోనమెత్తిన తమన్నా.. దాదాపు 800 మందితో!
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్నతాజా చిత్రం ఓదెల-2. ఈ సినిమాను అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. చీర కట్టులో తమన్నా బోనం మోస్తున్న పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 800 మందితో క్లైమాక్స్ సీన్ షూట్..ఈ చిత్రం క్లైమాక్స్ కోసం ఏకంగా 800 మంది కళాకారులతో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో జరుగుతోంది. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే అత్యంత భారీ ఆలయ సెట్ను అధిక బడ్జెట్తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో తమన్నాతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతమందిస్తున్నారు. Team #Odela2 wishes everyone celebrating the festival a very Happy Bonalu ✨#Odela2 climax currently being shot in a Grand Mallanna Temple set erected at Ramoji Film City.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ImSimhaa @AJANEESHB @SampathNandi_TW @creations_madhu… pic.twitter.com/xfSR8QFfZh— Telugu FilmNagar (@telugufilmnagar) July 29, 2024
ఈ సినిమా చూశాక కన్నీళ్లు ఆపుకోలేకపోయా: తమ్మారెడ్డి భరద్వాజ
కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియెన్స్ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్తో వచ్చిన సినిమానే మ్యూజిక్ షాప్ మూర్తి.. ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో కూడా సందడి చేస్తుంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ సినిమాను థియేటర్లో చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓటీటీలో విడుదలైన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా ప్రతినిధుల సమక్షంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకనిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.ఈ సందర్భంగా నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. 'ప్రతి మనిషి జీవితంలో జరిగే కథనే ఇది. ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చిన తర్వాతే విజయం వరిస్తుంది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ ఎంతో కో-ఆపరేటివ్ గా పని చేశారు. ఓ ఫ్యామిలీలా అందరం కలిసి ఈ సినిమాను రూపొందించాం. నన్ను తెలుగు తెరపై చూపించిన మొదటి దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ సినిమా చూసి నాకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ సినిమా కథను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలకు సెల్యూట్. శివ సినిమాను బాగా రూపొందించారు. ఈ సినిమాలోని చాలా సీన్స్ నా నిజ జీవితంలో జరిగినవే.' అని ఆయన అన్నారు.ముఖ్య అతిధిగా వచ్చిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చూశాక ఈ అజయ్ ఘోష్ని పెట్టి సినిమా తీసుకున్నారు. వీళ్ళ పని అయిపోనట్లే అనుకున్నా. కానీ, సినిమా చూశాక మతిపోయింది. చివరలో అయితే ఈ సినిమా సీన్స్ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఈ సినిమాను చాలా డిఫరెంట్గా రూపొందించారు. కష్టాలు, కన్నీళ్లు కాదు మంచితనంతో కొట్టారు. సినిమా సక్సెస్ అయింది కానీ ఈ సినిమాతో వీళ్లకు డబ్బులు వచ్చాయని అయితే నేను నమ్మను. మంచి సినిమాను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలకు మీడియా వాళ్ల సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది.' అని తమ్మారెడ్డి అన్నారు.
చావే దిక్కనుకున్నా.. కూతురి కోసం ఆగిపోయా: లేడీ కమెడియన్
ఆర్య.. లేడీ కమెడియన్. బడాయి బంగ్లా అనే కామెడీ షోతో తన పేరు కాస్తా ఆర్య బడాయిగా మారిపోయింది. నటిగా, హాస్య నటిగా, యాంకర్గా, జడ్జిగా ఇలా వివిధ పాత్రలు పోషించే ఆమె సినిమాలు, రియాలిటీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. అందరినీ కడుపుబ్బా నవ్వించే ఆర్య జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. 2008లో ఐటీ ఇంజనీర్ రోహిత్ సుశీలన్ (నటి అర్చన సుశీలన్ సోదరుడు)ను పెళ్లాడగా వీరికి రోయ అనే కూతురు పుట్టింది. కూతురి పేరు మీద ఓ బొటిక్ కూడా ఓపెన్ చేసింది. అయితే ఏమైందో ఏమో కానీ 2019లో భర్తతో విడిపోయి కూతురితో ఒంటరిగా నివసిస్తోంది.బిగ్బాస్ తర్వాత డిప్రెషన్తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను బయటపెట్టింది. బిగ్బాస్ నుంచి వచ్చాక డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడలేకపోయాను. చనిపోయేందుకు ప్రయత్నించాను. నిద్రమాత్రలు తీసుకున్నాను. కానీ నా కూతురిని చూసి ఆగిపోయాను. తనే నన్ను ఆ బాధలో నుంచి బయటపడేసింది. ఎప్పుడైనా సరే మనకు తట్టుకోలేనంత బాధ అనిపిస్తే దాన్నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తాం. చావు ఒక్కటే మార్గం అనుకుంటాం. మరణమే మార్గమనుకున్నాలాక్డౌన్లో నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది. మాట్లాడేందుకు కూడా ఎవరూ లేరు. చావే సరైన నిర్ణయమనుకున్నాను. కానీ నా కూతురు.. తన పరిస్థితి ఏం కావాలి? తనను చూసుకోవడానికి మా నాన్న కూడా లేరు. ఆయన ఉండుంటే కూతుర్ని ఆయన చూసుకుంటాడన్న ధీమాతో ఎప్పుడో ప్రాణాలు వదిలేసేదాన్ని. నేను, అమ్మ, వదిన, పాప.. వాళ్లకంటూ ఉన్నది నేనేగా! అందరినీ వదిలేసిపోతే వాళ్లుం ఏం చేస్తారు? నా కూతురు జీవితం ఏమైపోతుంది? పాపను తన తండ్రి బాగానే చూసుకుంటాడు.కూతురి కోసం ఆలోచించి ఆగిపోయాకానీ చుట్టూ ఉన్న సమాజం ప్రేమలో ఓడిపోయి మీ అమ్మ బలవన్మరణానికి పాల్పడిందంటూ కాకుల్లా పొడిచి మరీ చెప్తారు. అవన్నీ ఆలోచించి ఆగిపోయాను. నా కుటుంబంతో, ఫ్రెండ్స్తో మాట్లాడాను. మళ్లీ సరైన దారిలోకి వచ్చాను. పెళ్లి విఫలమవడాన్ని భరించాను, తర్వాత బ్రేకప్ బాధనూ తట్టుకున్నాను, ఆఖరికి నాన్న మరణాన్ని సైతం తట్టుకుని నిలబడ్డాను. అందుకే అందరూ నన్ను బోల్డ్ అని పిలుస్తుంటారు. కానీ నేను చాలా ఎమోషనల్.. అని ఆర్య చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) చదవండి: నటుడి ఇంట మొన్న విషాదం.. అంతలోనే సంతోషం..
క్రీడలు
భారత్ వేదికగా ఆసియాకప్-2025.. పాకిస్తాన్ వస్తుందా?
పురుషుల ఆసియాకప్-2025కు భారత్ ఆతిథ్యమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఆసియాకప్ జరగనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా 2024 నుంచి 2027 కాలానికి గాను స్పాన్సర్షిప్ హక్కుల కోసం ఐఈవోఐ(IEOI)లను ఆహ్వానించింది. దీని ప్రకారం ప్రకారం వచ్చే ఏడాది ఆసియాకప్ భారత్లో జరగనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా గతేడాది వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్కు పాకిస్తాన్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు. అదే విధంగా ఆసియాకప్-2026(వన్ఢే ఫార్మాట్)కు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం భారత్ వేదికగా జరిగే ఆసియాకప్లో మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నేరుగా ఆర్హత సాధించగా.. మరో జట్టు క్వాలిఫియర్స్ ఆరో జట్టుగా టోర్నీలో అడుగుపెడుతుంది. అదే విధంగా మొత్తం 13 మ్యాచ్లో ఈ ఈవెంట్లో జరగనున్నాయి. ఆసియాకప్-2023(వన్డే ఫార్మాట్) విజేతగా భారత్ నిలవగా.. అంతకుముందు ఆసియాకప్-2022(టీ20 ఫార్మాట్) ఛాంపియన్స్గా శ్రీలంక నిలిచింది.పాక్ వస్తుందా?వన్డే ప్రపంచకప్-2023లో తలపడేందుకు భారత్కు వచ్చిన పాకిస్తాన్ మరోసారి తమ దాయాది గడ్డపై అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అయితే వాస్తవానికి గతేడాది ఆసియాకప్కు పాకిస్తాన్ ఒంటరిగానే ఆతిథ్యమివ్వాల్సింది. కానీ భారత జట్టును పాక్కు పంపేందుకు బీసీసీఐ నిరాకరిచిండంతో హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరిగింది.భారత్ తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు కూడా పాక్ను ఆతిథ్యమివ్వనుంది. కానీ మరోసారి తమ జట్టును పాక్కు పంపేందుకు బీసీసీఐ సిద్దంగా లేదు. ఆసియాకప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇంక ఈ విషయంపై ఎటువంటి స్పష్టత లేదు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు టీమిండియా తమ దేశానికి రాకపోతే.. పాక్ ఆసియాకప్లో తలపడేందుకు భారత్కు వస్తుందో లేదో వేచి చూడాలి.
భారత్లో మరో టీ20 లీగ్.. తొలి ఎడిషన్ అప్పటి నుంచే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. 2008లో మొదలైన ఈ టీ20 లీగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్గా పేరొందిన ఐపీఎల్లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే ఆటగాళ్లపై కనకవర్షం కురవడం ఖాయం. అంతేకాదు.. ఇక్కడ ప్రతిభ చూపితే జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకునే అవకాశాలు ఉంటాయి.ఇటీవలి కాలంలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ తదితరులు అలా టీమిండియాలో చోటు దక్కించుకున్న వాళ్లే. యంగ్ టాలెంట్ హంట్లో భాగంగా దేశవాళీ క్రికెట్, అండర్-19 టోర్నీల్లో ఆకట్టుకున్న ఆటగాళ్ల నుంచి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన వాళ్లను ఎంపిక చేసుకుంటాయి.ఇప్పటికే పలు స్థానిక లీగ్లుఈ క్రమంలో పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు సైతం టీ20 లీగ్లు నిర్వహిస్తూ స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, పంజాబ్ ప్రీమియర్ లీగ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ బోర్డు సైతం ఇదే బాటలో నడవాలని నిశ్చయించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పేరిట టోర్నీని ఆరంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు 2024 ద్వితీయార్థ భాగంలో ఈ లీగ్ను మొదలుపెట్టనున్నట్లు పేర్కొంది. మ్యాచ్లన్నీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది.అదే స్పెషల్ ఇక్కడమిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఢిల్లీ తమ ప్రీమియర్ లీగ్ను నిర్వహించనుంది. ఈ టోర్నీలో పురుషులతో పాటు మహిళా జట్లకు కూడా అవకాశం ఇవ్వనుంది. మొత్తంగా 40 మ్యాచ్లు నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపిన డీడీసీఏ.. ఇందులో 33 మెన్, 7 వుమెన్ క్రికెట్ మ్యాచ్లు ఉంటాయని వెల్లడించింది.ఇక ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో మొత్తంగా ఆరు జట్లు(మెన్) ఉంటాయని.. వీటికోసం ఫ్రాంఛైజీలు రూ. 49.65 కోట్ల రూపాయాల మేర ఖర్చు చేయవచ్చని డీడీసీఏ తెలిపింది. ఇందులోని టాప్ 4 బిడ్డర్లు మహిళా జట్లను ఆటోమేటిక్గా కైవసం చేసుకుంటాయని పేర్కొంది. స్థానికంగా క్రికెట్ను మరింత అభివృద్ధి చేసేందుకే ఈ లీగ్ ఆరంభిస్తున్నట్లు తెలిపింది.
హార్ట్ బ్రేకింగ్.. ఒకే ఒక్క పాయింట్! తృటిలో చేజారిన పతకం
ప్యారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో భారత్కు తృటిలో మరో పతకం చేజారింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత షూటర్ అర్జున్ బాబుటా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో పతకానికి 1.1 పాయింట్ దూరంలో అర్జున్ నిలిచిపోయాడు.ఓ దశలో గోల్డ్మెడల్ రేసులో ఉన్న అర్జున్ ఒత్తడిలో తప్పిదాలు చేస్తూ 208.4 పాయింట్లతో నాలుగో స్ధానానికి పడిపోయాడు. క్రొయేషియా షూటర్ మిరాన్ మారిసిచ్ 209.3 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.ఇక 231.1 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచిన చైనా షూటర్ షెంగ్ లిహావోకు గోల్డ్ మెడల్, 230.5 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన జర్మనీ షూటర్ విక్టర్ లిండ్గ్రెన్ సిల్వర్ మెడల్ దక్కింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో కూడా భారత్కు నిరాశే ఎదురైంది. ఫైనల్స్లో భారత షూటర్ రమితా జిందాల్ ఏడో స్ధానంతో సరిపెట్టుకుంది. దీంతో ఒలింపిక్ పతకాన్ని సాధించే అవకాశాన్ని రమితా జిందాల్ కోల్పోయింది.
శెభాష్ మనూ! మరో పతకానికి గురి.. చరిత్రకు అడుగుదూరంలో
భారత షూటింగ్ జోడీ మనూ భాకర్- సరబ్జోత్ సింగ్ ప్యారిస్ ఒలింపిక్స్-2024లో శుభారంభం చేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సోమవారం నాటి క్వాలిఫికేషన్ రౌండ్లో మూడో స్థానంలో నిలిచారు. తద్వారా మనూ- సరబ్జోత్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. ఇద్దరూ కలిసి 580 పాయింట్లు స్కోరు చేసి.. బ్రాంజ్ మెడల్ పోటీలో నిలిచారు. అయితే, ఈ ఈవెంట్లో మరో జోడీ రిథమ్ సంగ్వాన్- అర్జున్ సింగ్ చీమా మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. టాప్-3కి చేరుకోలేక రేసు నుంచి నిష్క్రమించారు. మరోవైపు.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వుమెన్స్ మెడల్ ఈవెంట్లో రమితా జిందాల్ నిరాశపరిచింది. మెడల్ రౌండ్కు ఆమె అర్హత సాధించలేకపోయింది.చరిత్రకు అడుగు దూరంలో మనూ భాకర్10 మీటర్ల వుమెన్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో 22 ఏళ్ల మనూ భాకర కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా షూటర్గా చరిత్ర సృష్టించిన ఈ హర్యానా అమ్మాయి.. మరో పతకానికి గురిపెట్టింది.సరబ్జోత్తో కలిసి 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. మంగళవారం(మద్యాహ్నం ఒంటి గంటకు) జరుగనున్న ఈ పోటీలో గనుక మనూ- సరబ్జోత్ గెలిస్తే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్గా మనూ భాకర్ రికార్డు సృష్టిస్తుంది. శతాబ్దం తర్వాతఅదే విధంగా.. ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్గా నిలుస్తుంది. 1900 ఒలింపిక్స్లో బ్రిటిష్- ఇండియన్ నార్మన్ పిచార్డ్ 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్లో కలిపి రెండు రజత పతకాలు సాధించాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. మనూ ఇప్పుడు రికార్డు బ్రేక్ చేయగల అరుదైన రికార్డు ముంగిట నిలిచింది.
బిజినెస్
తయారీ కేంద్రంగా భారత్!.. చెప్పడం సాహసమే
వారానికి 72 గంటల పని గురించి చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. చైనాను భారత్ అధిగమిస్తుందని పలువురు నిపుణులు చెబుతుంటే.. తయారీ రంగంలో ఇండియా చైనాని దాటాలంటే అనేక సవాళ్ళను ఎదుర్కోవాలని 'ఈఎల్సీఐఏ టెక్ సమ్మిట్ 2024'లో పేర్కొన్నారు.ఇండియా సామర్థ్యం మీద సందేహంగా ఉంది. ఇప్పటికే చైనా ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్ మార్కెట్లు, హోమ్ డిపోలలోని దాదాపు 90 శాతం వస్తువులు చైనాలో తయారైనవే ఉన్నాయి. అవన్నీ భారత్ జీడీపీకి ఆరు రెట్లు. కాబట్టి ఈ సమయంలో మన దేశం చైనాను అధిగమిస్తుందని చెప్పడం సాహసమనే చెప్పాలి అని నారాయణ మూర్తి అన్నారు.ఐటీ రంగ ఎగుమతుల్లో భారత్ వృద్ధి సాధిస్తుండగా.. తయారీ రంగం మాత్రం దేశీయ సహకారం, ప్రభుత్వ మద్దతు వంటి వాటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ లక్ష్యాలను చేరుకోవాలంటే.. ప్రభుత్వాల పాత్ర చాలా కీలకమని నారాయణ మూర్తి అన్నారు. ఇది మెరుగుపడాలంటే ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమాచారం లోపాలను తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తలు మార్కెట్ పరిస్థితులను మెరుగ్గా అంచనా వేయాలి, అప్పుడే తయారీ రంగం అభివృద్ధి చెందుతుంది అని ఆయన అన్నారు.
‘ఈ దుస్తులు కొనండి’.. ప్రధాని మోదీ
గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వల్ల దేశవ్యాప్తంగా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం సాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళల్లో పెరుగుతున్న ఆదరణ, ఉద్యోగాల కల్పన కారణంగా 400 శాతం ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. భారత పౌరులు ఖాదీ దుస్తులు కొనుగోలు చేయాలని మన్ కీ బాత్ ప్రసారంలో భాగంగా మోదీ పౌరులకు సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. గతంతో పోలిస్తే వీటి విక్రయాలు 400 శాతం పెరిగాయి. ఖాదీ, చేనేత విక్రయాలు పెరిగి పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ పరిశ్రమ పురోగతి వల్ల దీనిపై ఎక్కువగా ఆధారపడిన మహిళలకు ప్రయోజనం చేకూరుతోంది. ఇంతకుముందు ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించని చాలా మంది ప్రజలు ఇప్పుడు గర్వంగా వీటిని ధరిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాదీ దుస్తులు కొనకపోతే వాటిని కొనడం ప్రారంభించండి’ అని మోదీ చెప్పారు.ఇదీ చదవండి: అప్పు చెల్లించని వైజాగ్ స్టీల్ప్లాంట్!ఇదిలాఉండగా, ప్రభుత్వం చేనేత, ఖాదీ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహకాలు అందించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. కేంద్ర బడ్జెట్లో నేషనల్ హ్యాండ్యూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం రూ.200 కోట్లు కేటాయించారు. రానున్న బడ్జెట్లో ఆ నిధులను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ విధానాలతో గార్మెంట్ ఉత్పత్తులు తయారుచేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు వెంటనే నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
1,000 టూ 25,000 పాయింట్లు.. నిఫ్టీ ప్రస్థానం
నిఫ్టీ 50 ఇండెక్స్ సోమవారం చరిత్రాత్మక మార్కు 24,999.75ను తాకింది. నవంబర్ 1995లో 1,000 పాయింట్లతో ప్రారంభమైన నిఫ్టీ సూచీ 25,000 మార్కును చేరడానికి సుమారు 29 ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరత, ఆర్థికమాంద్యం వంటి ఎన్నో ఒడిదొడుకులను అధిగమించింది. దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు కొనసాగిస్తే స్టాక్మార్కెట్లో మంచి రాబడులు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ 1,000 నుంచి 25,000 మార్కు చేరడానికి పట్టిన సమయాన్ని తెలుసుకుందాం.ఇదీ చదవండి: నిఫ్టీ 25,000 పాయింట్లకు..?1000 నుంచి 2,000 మార్కు-9 ఏళ్ల, 1 నెల 10 రోజులు3000 మార్కు-1 సంవత్సరం 2 నెలలు4,000 మార్కు-1 సంవత్సరం 5,000 మార్కు-10 నెలలు6,000 మార్కు-2 నెలలు7,000 మార్కు-6.5 సంవత్సరాలు 8,000 మార్కు-4 నెలలు9,000 మార్కు-రెండున్నరేళ్లు 10,000 మార్కు-4 నెలలు10,000 నుంచి 20,000కి చేరుకోవడానికి 6 సంవత్సరాలు21,000 మార్కు-61 సెషన్లు22,000 మార్కు-ఒక నెల 23,000 మార్కు-5 నెలలు24,000 మార్కు- నెల కంటే తక్కువ సమయం24,999.75 మార్కు-రెండున్నర నెలలు
టోల్గేట్స్ గాయబ్.. వసూళ్లు మాత్రం ఆగవు
టోల్ గేట్స్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గిందడానికి ఫాస్ట్ట్యాగ్ విధానం తీసుకువచ్చారు. ఇప్పుడు ఫాస్ట్ట్యాగ్ విధానానికి స్వస్తి పలికి శాటిలైట్ విధానం తీసుకురావడానికి కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొన్నారు.మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ పేర్కొన్నారు.ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన శాటిలైట్ టోల్ కలెక్షన్ విజయవంతమవ్వడంతో.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ సిస్టమ్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం గురించి వాహన వినియోగదారులలో అవగాహన కల్పించడానికి ఓ వర్క్షాప్ కూడా ఏర్పాటు చేసినట్లు గడ్కరీ పేర్కొన్నారు. మొత్తం మీద దేశంలో టోల్ గేట్స్ త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.శాటిలైట్ విధానం ద్వారా టోల్ కలెక్షన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌట్ కట్ చేసుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ కోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కల్గిన ఫాస్ట్ట్యాగ్ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణించిన దూరానికి అయ్యే మొత్తాన్ని ఆటోమాటిక్గా చెల్లించడానికి సాధ్యమవుతుంది.
ఫ్యామిలీ
పచ్చిమిరపమొక్కల్ని ఇలా పెంచితే కాయలే కాయలు!
గార్డెనింగ్ ఒక కళ. కాస్త ఓపిక, మరికాస్త శ్రద్ధపెడితే ఇంట్లోనే చాలారకాల పూల మొక్కల్ని పెంచుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు పండించు కోవచ్చు. పైగా వర్షాకాలం కాబట్టి బాల్కనీలోగానీ, ఇంటిముందు ఉన్న చిన్నస్థలంలోగానీ హాయిగా వీటిని పెంచు కోవచ్చు. గార్డెనింగ్తో మనసుకు సంతోషం మాత్రమేకాదు ఆర్గానిక్ ఆహారాన్ని తిన్నామన్న ఆనందమూ మిగులుతుంది. కిచెన్గార్డెన్లో చాలా సులభంగా పెరిగే మొక్కల్లో ఒకటి పచ్చి మిరపకాయ. ఇంట్లోనే పచ్చి మిరపకాయలను ఎలా పండించవచ్చు? తొందరగా పూత, కాపు రావాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.పచ్చిమిరపతో చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఆహారంలో రుచిని జోడించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రసిద్ధి చెందిన విటమిన్ సి విటమిన్ పుషల్కంగా లభిస్తుంది. మొటిమలు, చర్మం ముడతల్ని నివారిస్తుంది. జుట్టుకు మంచిది , బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తికి కూడా చాలా మంచిది. మరి ఇన్ని రకాల లాభాలున్న ఈ చిన్ని మొక్కను ఎలా పెంచుకోవాలి.సరైన విత్తనాలు ఎంచుకోవడం ముఖ్యంగా. సాధారణంగా ఎండుమిరపగింజలు వేసినాసులభంగా మొలకెత్తుతాయి. కానీ మంచి ఫలసాయం రావాలంటే నాణ్యమైన విత్తనాలను తెచ్చుకోవాలి. చిన్ని చిన్న కంటైనర్లు , కుండీలలో కూడా బాగా పెరుగుతాయి. 3-4 అంగుళాల లోతు , సరైన డ్రైనేజీ రంధ్రాలు ఉండేలా చూసుకోండి. తేమ , వెచ్చని వాతావరణం అవసరం కాబట్టి వాటిని పండించడానికి ఇంట్లో సెమీ షేడ్ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. కంపోస్ట్ కలిపిన సారవంతమైన మట్టితో కుండీని ఉపయోగించాలి. మంచి నాణ్యమైన పచ్చిమిర్చి విత్తనాలను తీసుకుని, కుండీలో ఒక అంగుళం లోతులో నాటండి. మట్టిని తేమగా ఉంచాలి. అలా అని ఎక్కువ నీరు పోయకూడదు. వాతావరణాన్ని బట్టి ప్రతి రోజు లేదా ప్రతి 2 రోజులకు ఒకసారి నీరు పోయాలి. నీళ్లు ఎక్కువైతే మొక్క కుళ్లిపోతుంది. విత్తనాలను నాటిన 7-10 రోజులలో రెండు చిన్న మొలకలు వస్తాయి. వీటికి ప్రతిరోజూ 5-6 గంటల సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. కాస్త ఎదిగిన తరువాత ఈ మొక్కలకు ట్రిమ్మింగ్ చాలా కీలకం. పూతకు ముందే చివర్లను కత్తిరిస్తే, మొక్క గుబురుగా వచ్చి, తొందరగా పూత కొస్తుంది. పూత దశలో లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కకు అందిస్తే పూత నిలబడి, బోలెడన్ని కాయలు వస్తాయి. సరైన రక్షణ, పోషణ అందితే దాదాపు రెండేళ్లయినా కూడా మిరప చెట్టు కాయలు కాస్తుంది.
‘దోస్త్ మేరా దోస్త్’తో సెల్ఫీ సంబరం
‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ ఈ ప్రపంచంలో ఎవ్వరైనా ఈ మాటల్ని వింటే పులకించి పోవాల్సిందే. అదీ స్నేహం గొప్పతనం. స్నేహానికి కులం, మతం, ప్రాంతం, భాష, లింగ భేదాలేవీ వుండవు. ఉన్నదంతా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడమే. దోస్త్ అంటే వీడేరా అనిపించేంత బంధం. మరి ‘దోస్త్ మేరా దోస్త్ తుహై మేరీ జాన్.. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం’’ అనుకునేంత గొప్ప దోస్తులు మీ జీవితంలో ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం అలాంటి నిజమైన స్నేహితుడితో సంతోష క్షణాలను మళ్లీ గుర్తు చేసుకోండి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ దోస్తుతో సెల్పీ దిగి సాక్షి. కామ్కు పంపించండి. ‘దోస్త్ మేరా దోస్త్’ సెల్పీ 9182729310 నెంబరుకు వాట్సాప్ చేయండి. ఆ ఫొటోలను సాక్షి డాట్ కామ్లో ప్రచురిస్తాం. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడమే కాదు.. ఈ జ్ఞాపకాన్ని కలకాలం పదిల పర్చుకోండి. ఫ్రెండ్షిప్ డే గురించి ఇవి మీకు తెలుసా?అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ ప్రతిపాదన 1958 జూలై 30న పరాగ్వేలో మొదలైంది. వరల్డ్ ఫ్రెండ్షిప్ డే ఆలోచనను తొలిసారి 1958, జూలై 20న పరాగ్వేలో స్నేహితులతో విందు సందర్భంగా డాక్టర్ ఆర్టెమియో బ్రాచో ప్రతిపాదించారు.ఐక్యరాజ్యసమితి 2011లో జూలై 30ని అధికారిక అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని వివిధ దేశాలలో వేర్వేరు రోజులలో జరుపుకుంటారు. భారతదేశంలో ఆగస్టు నెలలోని తొలి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేను(జులై 30ని) కూడా ఫాలో అవుతోంది ఇండియా.మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, బంగ్లాదేశ్తో సహా ఇతర దేశాలలో జూలై 30న జరుపుకుంటారు.
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన..!
తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారికి దగ్గరగా బంగాళాఖాతం సముద్ర తీరం వద్ద ఉన్న కుగ్రామం అది. అక్కడినుంచి ఓ యువకుడు స్వామి వారి దర్శనార్థం తిరుమల బయలుదేరాడు. ఏడు పదుల వయస్సు నిండిన తండ్రి కూడా తిరుమల వస్తానన్నాడు. అయితే, కూర్చుంటే లేవలేని, లేస్తే కూర్చోలేని ఆ వృద్ధుడి శరీరం ప్రయాణానికి సహకరించలేదు. కొండకు రాలేక పోతున్నందులకు తండ్రి చాలా బాధపడ్డాడు. ఇంటిలోని స్వామి వారి పటాన్ని చూస్తూ ‘‘మహిమలున్న స్వామివారి కొండనుంచి ఎన్నాళ్ళయినా చెడనిది, నీటిలో కరగనిది, ఎన్నటికీ వాడనిది ఏదైనా ఒకటి తీసుకుని రా! అయితే అది పవిత్రమైనదిగా ఉండాలి!!’’ అని చెప్పాడు.‘‘అలాగే నాన్నా!’’ అని చెప్పి రైలు ఎక్కాడు ఆ యువకుడు. ఆ రోజు గురువారం కావడంతో అతి నిరాడంబర స్వరూపంతో నొసటన చాలా సన్నని నామం మాత్రమే కలిగి ఉన్నారు స్వామివారు. గురువారం మాత్రమే కనిపించే ‘నేత్ర దర్శనం’ తృప్తిగా చేసుకున్న ఆ యువకుడు ఆనంద నిలయం నుంచి బయటికి వచ్చాడు. లడ్డూ ప్రసాదాలూ, కలకండ, తులసి చెట్టు లాంటివి తీసుకున్నాడు. గబుక్కున తండ్రి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. అయితే, తండ్రి చెప్పినట్లు ‘చెడనిది, కరగనిది, వాడనిది, ఏదై ఉంటుందా?’ అని ఆలోచించాడు. తను తీసుకున్న లడ్డూ ప్రసాదం వైపు చూశాడు. ‘ప్రసాదం ఎక్కువ కాలం నిల్వ ఉండదు కదా’ అనుకున్నాడు. కలకండ వైపు చూశాడు. ‘ఇది నీటిలో సులభంగా కరిగి΄ోతుంది కదా’ అని భావించాడు. తులసి చెట్టు వైపు చూశాడు. ‘కొన్నేళ్ళకైనా చెట్టు వాడినొతుంది కదా’ అని తలచాడు. ‘మరి తండ్రి చెప్పినట్లు వేరే ఏదైనా ఇక్కడ దొరుకుతుందా?’ అని మాడ వీధుల్లో వెదికాడు. ఆలాంటి వస్తువు ఏదీ అతడికి కనిపించలేదు. ‘నాన్నకి సులభంగా మాట అయితే ఇచ్చాను కానీ, అది నేరవేర్చలేకపోతున్నానే...’ అని బాధగా నడవటం ప్రారంభించాడు. రైల్లో వెళ్ళడానికి మరింత సమయం ఉండటంతో నామాల మిట్ట వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. ‘పరిష్కారం ఏమిటా?’ అని పరిపరి విధాలా ఆలోచించాడు. అయితే పరిష్కారం ఏదీ దొరకలేదు. అక్కడినుంచి శిలా తోరణం వద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు. సహజసిద్ధమైన ఆ తోరణాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో హిందీ భాష మాట్లాడుతూ ఉన్న ఉత్తర భారత దేశీయులు ఉన్నారు. వాళ్ళు కారులో నుంచి దిగిందే ‘గోవిందా గోవిందా’ అని నామస్మరణ చేస్తూ నేలకు నమస్కరించారు. అక్కడే ఉన్న చిన్న రాళ్ళకు కూడా దండాలు పెట్టారు. అప్పుడు అతడి మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది.తిరుమల కొండలోని చెట్టూ పుట్టా, రాయీ ర΄్పా... అన్నీ పవిత్రమైనవే! ఈ నేలంతా స్వామి వారి పాద స్పర్శతో పునీతమైనదే. కాబట్టి ఇక్కడి రాయిని తీసుకెళ్ళి నాన్నకి ఇస్తాను. నాన్న చెప్పినట్లు ‘చెడనిది, కరగనిది, వాడనిది... పవిత్రమైనదీ ఇదే’ అని భావించి ఒక గుండ్రటి రాయిని తీసుకుని సంచిలో వేసుకున్నాడు. గోవింద నామ స్మరణలు చేస్తూ ఊరికి ప్రయాణం కట్టాడు. కొడుకు తెచ్చిన రాయిని చేతిలోకి తీసుకున్న ఆ వృద్ధుడి కళ్ళు తన్మయత్వంతో తడి అయ్యాయి. ఆ రాయికి పాలతో, నీళ్ళతో అభిషేకం చేసి, నామాలు పెట్టి, తులసి మాల వేసి దేవుడి గదిలో ఉంచారు. ‘స్వామే మన ఇంటికి నడిచి వచ్చాడు!’’ అనుకుంటూ భక్తిశ్రద్ధలతో పూజ చేసి, కొండ లడ్డును ఊరంతా పంచిపెట్టారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
నిష్కల్మషం నిరంతర ప్రక్రియ
బతికి ఉన్నంత కాలం అన్నం తినటం ఎంత అవసరమో శుచిగా ఉండటం అంతే అవసరం. శుచిగా ఉండటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్కసారి ఆపితే మకిలి పేరుకు పోతుంది. తరువాత యథాస్థితికి తేవటానికి సమయం చాలా అవసర మౌతుంది. రాగిచెంబుని ఎంత తోమితే అంత మెరుస్తుంది అని ఒక నానుడి. రాగిచెంబే కాదు జీవితమైనా అంతే. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఇల్లయినా, ఒళ్లయినా, సమాజమైనా, దేశమైనా, మరేదైనా సరే! భౌతికమైన అంటే పరిసరాల, శారీరక శౌచం మాత్రమే కాదు మనసుని కూడా శుభ్రం చేస్తూ ఉండాలి. జీవప్రక్రియ జరుగుతున్నప్పుడు వ్యర్థాలు వెలువడటం సహజం. వాటిని ఎప్పటి కప్పుడు తొలగించక పోతే చెత్త పేరుకుపోతుంది. ఆరోగ్యం పాడవటం జరుగుతుంది. మనసు కూడా బాగా పని చేసినప్పుడు మథనంలో కావలసిన ఆలోచనలతో పాటు అక్కర లేనివి కూడా వస్తాయి. వాటిని పరిహరించక పోతే బుర్ర చెడి పోతుంది. ఒక్కక్షణం ఏమరుపాటు కలిగినా జరగవలసిన హాని జరిగిపోతుంది. మనకి మిత్రులలాగా కనపడుతూ కీడు చేసే శత్రువులు అవకాశం కోసం ఎదురు చూస్తూ తొంగిచూస్తూ ఉంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనసులో తిష్ఠవేసుకుని కూర్చుంటారు. ఆ శత్రువుల విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎంతో కాలంగా సాధన చేశాను, ఇంకెంత కాలం నియమ నిష్ఠలతో సాధన చెయ్యాలి? ఇంక చాలు – అంటూ ఉంటారు కొంతమంది. పుట్టినప్పటి నుండి గాలి పీలుస్తూనే ఉన్నాం కదా, ఇక గాలి పీల్చటం మానేద్దాం అని ఎవరైనా అనుకుంటారా? ఆఖరిక్షణం వరకు వీలైనంతగా కొనసాగించ వలసిందే. ఒక్కక్షణం ఆపితే ..? ఇంకేముంది? ఆ తరువాత గాలి పీల్చవలసిన పని ఉండదు. ఎందుకంటే గాలి పీల్చటం ఊపిరితిత్తుల ద్వారా రక్తాన్ని శుభ్రం చేయటమే. అందుకే అన్ని సంప్రదాయాల్లోను శౌచం అనే దానికి చాలా ్రపాధాన్యం ఉంది. అది పరిసరాలతో ్రపారంభమై శరీరం, మనస్సు, ఆత్మల వరకు విస్తరిస్తుంది. దీనిని సూచించటానికే జీసస్ పాత్రలు శుభ్రం చేస్తున్న చిత్రం ఒకటి కనపడుతుంది. అదేవిధంగా షిరిడీ సాయి బాబా కూడా పాత్రలు శుభ్రం చేస్తున్న చిత్రం ఉంటుంది. వాళ్ళకి ఎంగిలిపళ్ళాలు కడగవలసిన అవసరం ఏమిటి? అనే సందేహం ఎవరికైనా ఎప్పుడయినా వచ్చిందా?వాళ్ళు కడుగుతున్నది తమ శిష్యులు, లేక భక్తులు, లేక అనుయాయుల మనస్సులని కప్పిన పాపాలనే మలినాలని. పాపరహితులైన వారే నిరంతరం శుభ్రం చేయటానికి ్రపాధాన్యం ఇస్తూ ఉంటే సామాన్యుల మైన మనవంటి వార మెంత?పుట్టినప్పుడున్నంత నిష్కల్మషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒక్కరోజు నిర్లక్ష్యం చేస్తే అప్పటి వరకు చేసినదంతా తుడిచి పెట్టుకు పోతుంది. రోజూ తుడుస్తున్న అద్దాన్ని ఒక్కసారి తుడవకపోతే దుమ్ము΄÷ర ఉండి దానిలో ప్రతిబింబం సరిగ్గా కనపడదు. ఇది అందరికి ప్రత్యక్ష ప్రమాణం. అదే మనస్సనే అద్దం మీద కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే మలినాలు ఉంటే దానిలో పరమాత్మ రూపం సరిగ్గా ప్రతిఫలిస్తుందా? ఎన్నో మార్పులతో కనిపిస్తుంది. అందుకే సాధకులకి ఒక్కొక్కరికి దైవం ఒక్కొక్క విధంగా ఉన్నట్టు తోస్తుంది. వీటికితోడు అహంకార మమకారాలు ఆడే నాటకాలు కూడా తక్కువేమీ కావు. ఈ ΄÷రలు కప్పి ఉండటం వల్లనే ఎన్నో వికల్పాలు కలుగుతూ ఉంటాయి. కనుకనే వీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. లేకపోతే అదే సహజమైన రూపం అని భ్రమపడే ప్రమాదం ఉంది. ఈ భ్రమప్రమాదాల కారణంగా సాధన పెడత్రోవ పట్టే అవకాశం ఉంది. – డా.ఎన్. అనంత లక్ష్మి
National View all
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. విచారణకు కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటనపై కేంద్ర
మాంసాహారం వడ్డన.. వందేభారత్ రైలులో వెయిటర్పై దాడి
కలకత్తా: వందేభారత్ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది.
India: పాముకాటుతో ఏటా 50 వేల మంది మృతి.. ప్రపంచంలోనే అత్యధికం
న్యూఢిల్లీ: భారత్లో పాము కాటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆగస్ట్ 14 నుంచి .. నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్
ఢిల్లీ: నీట్ యూజీ కౌన్సిలింగ్పై కేంద్రం కీలక నిర్ణయం తీసు
ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్కు దక్కని ఊరట
సాక్షి,ఢిల్లీ : ఢీల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్కు ఊరట దక
International View all
లెబనాన్లో యుద్ధమేఘాలు.. పౌరులకు భారత్ అడ్వైజరీ
న్యూఢిల్లీ: గాజాకు పరిమితమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తాజాగా
నార్త్ కొరియా: వరద సహాయక చర్యల్లో కిమ్
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఖర
భారత్కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవుల అధ్యక్షుడు
మాలె: తమ దేశ రుణ చెల్లింపులను సులభతరం చేయటంలో మద్దుతు ఇచ్చిన
Bangladesh: ఎట్టకేలకు ఇంటర్నెట్ సేవలు.. మూడు రోజులు 5జీబీ డేటా ఫ్రీ
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై బంగ్లాదేశ్లో చెలరేగిన అందోళనలు సద్ద
ఇజ్రాయెల్కు హెచ్చరిక.. టర్కీ సంచలన నిర్ణయం!
అంకారా: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణా
NRI View all
టీడీపీ అరాచకాలపై లండన్లో నిరసన
లండన్, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ నాయ
ఎన్ఆర్ఐలకు చేదువార్త : పిల్లల భవిష్యత్తేంటి?
అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు మరో చేదు వార్త.
సిడ్నీలో ఘనంగా పుస్తక ఆవిష్కరణ..!
గురు పౌర్ణమి జూలై 21 వ తేదీ వినూత్నంగా సిడ్నీ మహానగరంలో తొలి పుస్తక ఆవిష్కరణ మహోత్సవం. ఒకటి కాదు, రెండు పుస్తకాలు.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్
వాష్టింగన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(59) అమెరికా
8 రోజుల అనంతరం తెనాలికి చేరిన రవితేజ మృతదేహం
తెనాలిరూరల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక
క్రైమ్
కాకినాడలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మురారీ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వివరాల ప్రకారం.. కాకినాడలోకి గండేపల్లి మండలం మురారీ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతిచెందారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక, మృతులను భీమవరానికి చెందిన వారిగా గుర్తించారు.
పెట్టుబడి తక్కువ.. మోసం ఎక్కువ
సాక్షి, అమరావతి: ప్రముఖ ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ పేరిట ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాలో వేల మందిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఆన్లైన్లో పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రెట్టింపు ఆదాయం లభిస్తుందని బురిడీ కొట్టించారు. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి మోసపోయామని విశాఖతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో బాధితులు లబోదిబోమంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు, లింక్ క్లిక్ చేస్తే చాలు అంటూ నెట్ఫ్లిక్స్ ఫాలో అనే యాప్ పేరిట 2021లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది బాధితులను బురిడీ కొట్టించారు. రూ. లక్షల్లో సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. ఇలాంటి నేరగాళ్లు, గొలుసుకట్టు ఇన్వెస్ట్మెంట్ సైబర్ ఫ్రాడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుంటూరుకు చెందిన రవి ఫోన్ నంబర్ను ఐపీజీ అనే పేరుతో ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినట్టు నోటిఫికేషన్ వచి్చంది. కొద్దిసేపటికి గ్రూప్ అడ్మిన్ ‘రూ.800 పెట్టుబడి పెడితే ఏడాదంతా రోజుకు రూ.35 చొప్పున ఆదాయం’ అంటూ మెసేజ్ పెట్టింది. గ్రూప్ సభ్యులు కొందరు కొన్ని స్క్రీన్షాట్స్ షేర్ చేసి తాముసంపాదిస్తున్నాం అంటూ వంతపాడారు. ఇవన్నీ చూసిన రవి వాళ్లను నమ్మి అడ్మిన్ సూచించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని రూ.800 పెట్టుబడి పెట్టాడు. తనకు తెలిసిన మరికొందరితోనూ పెట్టుబడి పెట్టించాడు. ప్రారంభంలో వాళ్లు చెప్పినట్లే చెల్లిస్తూ వచ్చారు. ఇది బావుందని భావించి రవి రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాడు. అంతే రెండు రోజుల్లోనే యాప్ పనిచేయకుండా పోయింది. మెసేజ్లకు అడ్మిన్ రిప్లై ఇవ్వలేదు. దీంతో మోసపోయానని రవి గుర్తించి లబోదిబోమన్నాడు. తక్కువ పెట్టుబడి. ఎక్కువ ఆదాయం.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఇంట్లో కూర్చుని టాస్్కలు పూర్తి చేస్తే డబ్బు వచ్చి ఖాతాలో జమ అవుతుంది అంటూ సైబర్ నేరగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. వీళ్ల ఉచ్చులో పడి పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, యువత తమ కష్టార్జితాన్ని సమరి్పంచుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నమ్మించిమోసం చేస్తారు.. అదనపు ఆదాయం వస్తుందనికొందరి ఆశే.. సైబర్ మోసగాళ్లకు వరమవుతోంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వరకూ నమ్మకంగా ఉంటూ ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. బాధితులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. టెలీగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా నేరగాళ్లు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గ్రూప్లు క్రియేట్ చేసి ఫలానా స్కీమ్ ద్వారా ఫలానా లాభం ఉంటుందని ఆకర్షిస్తున్నారు. ఈ తరహా యాప్లు, వెబ్సైట్లు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఏదైనా యాప్, వెబ్సైట్ను సందర్శించే ముందు ఒకటి రెండుసార్లు పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదు చేయండిలా దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఫిర్యాదులు చేయడానికి కేంద్ర హోమ్ శాఖ ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచి్చంది. https://www. cybercrime.gov.in./ వెబ్సైట్ ద్వారా, 1930 టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి బాధితులు మోసాలపై ఫిర్యాదులు చేయవచ్చు. అదే విధంగాసమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్/సాధారణ పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఒక వేళ ఓటీపీ, ఆన్లైన్ బ్యాంకింగ్ల ద్వారా మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఫిర్యాదు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. 2023లో దేశ వ్యాప్తంగా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో నమోదైన సైబర్ మోసాల ఫిర్యాదులు ఇలా..» ఢిల్లీ 58,748» బిహార్ 42,029» ఛత్తీస్గఢ్ 18,147» తెలంగాణ 71,426» ఆంధ్రప్రదేశ్ 33,507» కర్ణాటక 64,301 » కేరళ 23,757
ఒంటరితనం ఊపిరి తీసింది!
కర్నూలు సిటీ: కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీడీఎం)లో చదువుతున్న నల్ల సాయి కార్తీక్ నాయుడు(20) ఒంటరితనం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, కుదమ గ్రామానికి చెందిన నల్ల వెంకట నాయుడు కుమారుడైన సాయికార్తీక్ ట్రిపుల్ఐటీడీఎంలో ఈసీఈ బ్రాంచ్తో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.శనివారం క్యాంపస్లోని కలాం హాస్టల్ భవనం 9వ అంతస్తు నుంచి దూకడంతో కుడి కాలు విరిగి, తలకు తీవ్ర గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు. క్యాంపస్కు వేసవి సెలవులు ముగిసి ఈ నెల 22 నుంచి క్లాసులు తిరిగి ప్రారంభమయ్యాయి. సాయి కార్తీక్ క్యాంపస్కి వచ్చినప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ మానసికంగా ఇబ్బంది పడే వాడని, సమస్య ఏంటో ఎవరికీ చెప్పలేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు.చదువులో ఒత్తిడి ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారని సిబ్బంది చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఒంటరితనం, తాను చెప్పినా ఎవరు వినిపించుకోలేదని సూసైడ్ నోటులో రాసినట్లు సమాచారం. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాను చనిపోతే తల్లిని చూసేవారు లేరని హత్య
కొత్తగూడెంఅర్బన్: తల్లీకొడుకులిద్దరూ మానసిక వ్యాధితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో తాను మరణిస్తే తల్లిని చూసేవారు ఎవరూ ఉండరన్న ఆవేదనతో కుమారుడు తల్లిని హత్య చేసి.. ఆ తర్వాత తానూ బలవన్మరణానికి పాల్ప డ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శని వారం ఈ విషాద ఘటన వెలుగు చూసింది. పట్ట ణంలోని బూడిదగడ్డ ప్రాంతానికి చెందిన తుల్జాకు మారి పాసి (59)కి హారతిపాసి, వినయ్కుమార్ పాసి(28) ఇద్దరు సంతానం. ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా కూతురు హారతికి పదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం తల్లీకొడుకులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. తుల్జాకుమారి కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతోంది. వినయ్ కూడా అనారోగ్య సమస్యలతో బేకరీ లో పని మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. కూతురు హారతి కుటుంబం వారికి సమీపంలోనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వినయ్కుమార్ ఇనుప రాడ్తో తల్లిని కొట్టి హత్యచేసి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపుమడుగులో తుల్జాకుమారి..అమ్మ మ్మ, మేనమామకు టిఫిన్ ఇచ్చేందుకు హారతి కూతురు సునన్య శనివారం ఉదయం 10.30 గంటలకు తుల్జాకుమారి ఇంటికి వచ్చింది. ఆమె తలు పు తీసి చూడగా తుల్జాకుమారి రక్తపుమడుగులో పడి ఉంది. వినయ్కుమార్ ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా.. వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, త్రీటౌన్ పోలీసు లు చేరుకుని ఘటనను పరిశీలించారు. ఇనుపరాడ్ తో కొట్టడం వల్ల తుల్జాకుమారి తలకు తీవ్ర గాయ మై మృతి చెందిందని గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. హారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వీడియోలు
శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్..
22 ఏళ్ళు దేశం కోసం పనిచేస్తే... టీడీపీ వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్
నారాయణ, చైతన్య సహా కోచింగ్ సెంటర్లను నిషేధించండి
ఏపీకి అప్పులు కాదు... అభయం ఇవ్వండి
ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఎంపీ భాన్సూరి
ఏపీలో మహిళలు మహారాణులు రాజ్య సభలో దక్కిన గౌరవం
నీట్ లీక్ పై రాహుల్ కామెంట్స్ మోదీ సీరియస్..
కాంగ్రెస్ నేతలు Vs జగదీష్ రెడ్డి
కూటమి సర్కార్ కొత్త కుట్ర పేదలపై పెత్తనం
నీట మునిగిన యానాం
న్యూస్ పాడ్కాస్ట్
ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో మూడో స్థానం.. ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్గా రికార్డు.. ఇంకా ఇతర అప్డేట్స్
నీతి ఆయోగ్ సమావేశంలో తనను ఘోరంగా అవమానించారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపాటు... భేటీ నుంచి వాకౌట్.. ఇంకా ఇతర అప్డేట్స్
అవి శ్వేతపత్రాలు కాదు, అబద్ధపు పత్రాలు... హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు డ్రామాలు... ఏపీ సీఎంపై నిప్పులు చెరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
రైతులకు వెన్నుపోటు పొడిచారు, పథకాలకు తూట్లు పొడిచారు... తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో అరాచకాన్ని అడ్డుకుందాం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలవండి... జాతీయ మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి 75 వేల రూపాయలకు పెంపు... కొత్త పన్నుల విధానం శ్లాబుల్లో స్వల్ప మార్పులు.. ఇంకా ఇతర అప్డేట్స్
అసెంబ్లీ ఎదుట పోలీసుల అతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... రేపు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇంకా ఇతర అప్డేట్స్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోంది... రాష్ట్రపతి పాలన విధించాలి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.. ఇంకా ఇతర అప్డేట్స్